స్వీయ చిత్రం కోసం వస్తే చేయి చేసుకున్న మంత్రి

SMTV Desk 2017-11-21 17:21:21  Karnataka minister DK Anand Sivakumar, selfie

బెంగళూరు, నవంబర్ 21 : ఇటీవల వరుసగా వార్తల్లోకి వస్తున్న కర్ణాటక మంత్రి డి.కె. శివకుమార్‌, ఈ సారి సెల్ఫీ వార్తతో వచ్చారు. మంత్రి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఆ పార్టీ ప్రజాప్రతినిధులను బెంగళూరుకు తరలించారు. వారి బస ఏర్పాట్లను ఆ సమయంలో శివకుమారే చూసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఐటీ దాడులు జరుగగా, రూ.300 కోట్ల వెల్లడి కాని సొమ్మును గుర్తించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, తాజాగా మంత్రి శివకుమార్‌ బెల్గామ్‌లో బాలల హక్కులపై నిర్వహించిన ఓ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో ప్రసంగిస్తుండగా, సెల్ఫీ తీసుకోవడానికి తన వద్దకు వచ్చిన ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. అయితే ఈ ఘటనను తర్వాత మంత్రి సమర్థించుకున్నారు. ఇదో సాధారణఘటనని, నేను బాధ్యతగా మీడియాతో మాట్లాడుతున్నాను. ఆ సమయంలో సెల్ఫీ తీసుకోవాలని ఎలా వస్తారంటు ఆయన ప్రశ్నించారు.