నైజీరియాలో ఆత్మాహుతి దాడి..50 మంది మృతి!

SMTV Desk 2017-11-21 16:45:26  nizeriya terrorist attack, Isis, bomb blast

నైజీరియా, నవంబర్ 21: ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయి అమాయకులను బలిగొన్నారు. నైజీరియాలో ఉద‌యం ఈశాన్య అదమ‌వాలోని మ‌సీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 50 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప‌దుల సంఖ్యలో గాయపడ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఒక యువకుడు పేలుడు ప‌దార్థ‌ల‌తో మసీదులోకి వచ్చి తనని తాను పేల్చేసుకున్నాడ‌ని ప్ర‌త్య‌క్ష‌సాక్షులు చెబుతున్నారు. ఈ దాడి గురించి ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా ప్రకటించుకోలేనప్పటికీ ఐసిస్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.