అమరావతి, నవంబర్ 21 : శాసనసభ సమావేశంలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆంధ్రపదేశ్ వ్యవసాయ తీరును వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ...వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అంతేకాకుండా మన పద్దతులను అధ్యయనం చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బృందాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. 13.21లక్షల మంది రైతులకు రూ.1680కోట్ల పెట్టుబడి రాయితీ అందించడంతో పాటు, 2017లో మినుము పంటకు తెగుళ్లు వస్తే 7వేల మంది రైతులకు పెట్టుబడి రాయితీ ఇచ్చామన్నారు. కేవలం పెట్టుబడి రాయితీ కోసమే రూ.1900 కోట్లు ఖర్చు చేశారు. త్వరలో అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.