న్యూ ఢిల్లీ, నవంబర్ 21: సాధారణంగా పులిని చూస్తే జనం భయపడుతారు. కానీ పులి కంటే ఆవును చూస్తేనే జనం భయపడుతున్నారు అంటున్నారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మోడీ పుణ్యమా అని గో రక్షణ పేరుతో అనేక దళాలు ఏర్పడ్డాయి. ఈ దళాలకు భయపడి సంతలో ఆవుల క్రయవిక్రయాలు జరపడానికి ప్రజలు భయపడుతున్నారని ఇదంతా మోదీ ప్రభుత్వ చలవే అని ఆయన విమర్శించారు. దేశంలో జరిగిన అనేక ఘటనలు ఇందుకు ఉదాహరణలుగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. కాగా మోదీ 2018 లోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందని లాలూ జోస్యం చెప్పారు.