లండన్, నవంబర్ 21 : నువ్వా...నేనా... అని సాగిన ఏటీపీ వరల్డ్ టూర్ టోర్నమెంట్ ఫైనల్లో, బల్గేరియా ఆటగాడు గ్రిగోర్ దిమిత్రోవ్ ను విజయం వరించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఆర్ధరాత్రి జరిగిన ఫైనల్లో, బెల్జియం ఆటగాడు డేవిడ్ గాఫిన్ పై 7–6, 4–6, 6–3తో గెలుపొందాడు. దిమిత్రోవ్ కెరీర్ లో ఇది అతి పెద్ద విజయం కాగా, ఈ గెలుపుతో ప్రపంచ మూడో ర్యాంక్ కు చేరుకున్నాడు. విజేత గా నిలిచిన దిమిత్రోవ్కు రూ. 16 కోట్ల 58 లక్షలు, రన్నరప్ గాఫిన్కు రూ. 7 కోట్ల 53 లక్షలు నగదు లభించాయి. ఈ మ్యాచ్ తర్వాత దిమిత్రోవ్ మాట్లాడుతూ " విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వారం నా జీవితంలో మరువలేనిది" అని తెలిపారు .