న్యూఢిల్లీ, నవంబర్ 21 : దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సంస్థ, తయారు చేసిన ఆల్టో కార్లు అక్టోబరు లో అత్యధికంగా అమ్ముడుపోయాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్(ఎస్ఐఏఎం) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబరు నెలలో మారుతికే చెందిన డిజైర్ను వెనక్కి నెట్టి ప్రధమ స్థానంను దక్కించుకుంది. ఆగస్టు, సెప్టెంబరుల్లో ఆల్టో ఆధిపత్యానికి మారుతీ కాంపాక్ట్ సెడాన్ మోడల్ డిజైర్ ధీటుగా నిలిచిన విషయం తెలిసిందే. అక్టోబరులో ఆల్టో కార్లు 19,447 విక్రయం కాగా, డిజైర్ కార్లు 17,447 అమ్ముడయ్యాయి. ఆగస్టులో డిజైర్ (26,140 కార్లు) తొలిసారిగా ఆల్టో (21,521 కార్లు)ను అధిగమించింది.