యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు!

SMTV Desk 2017-11-21 11:19:26  cwc meeting, cwc, congress, rahul gandhi

న్యూ డిల్లీ, నవంబర్ 21: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం, అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేసింది. డిసెంబర్ 1 నుండి 4 దాక నామినేషన్లు స్వీకరించి, 5 వ తేదీన పత్రాల పరిశీలన చేస్తామని కాంగ్రెస్ మీడియా కు తెలిపింది. అయితే బరిలో రాహుల్ ఒక్కరే నిలుస్తారని అదే రోజు రాహుల్ ను అధ్యక్షుడిగా ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. ఈ ఎన్నిక గుజరాత్ ఎన్నికల కంటే ముందే నిర్వహించి, ఆ ఎన్నికలలో కాంగ్రెస్ లబ్ది పొందాలని చూస్తుంది.