కోల్కతా, నవంబర్ 21 : భారత్- శ్రీలంక మధ్య జరగబోయే మిగతా రెండు టెస్టులకు టీమిండియా పేసర్ భువనేశ్వర్ దూరం కానున్నాడు. అతను ఈ నెల 23న తన ప్రేయసి నుపుర్ను వివాహం చేసుకోబోతున్నాడు. భువి స్థానంలో తమిళనాడు ఆటగాడు విజయ్శంకర్ ఎంపికయ్యాడు. మరోవైపు ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత కారణాలతో రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అతను మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని సమాచారం. తొలి టెస్ట్ మ్యాచ్ లో భువనేశ్వర్ శ్రీలంక జట్టును తన బౌలింగ్ తో హడలెత్తించిన విషయం తెలిసిందే.