కోల్కతా, నవంబర్ 21 : భారత్- శ్రీలంక ల మధ్య ఈడెన్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్ నాటకీయ పరిణామల మధ్య "డ్రా" గా ముగిసింది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ అజేయ శతకంతో చెలరేగగా, బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కదం తొక్కగా ఒక దశలో భారత్ గెలిచేలా కన్పించింది. కానీ వెలుతురు లేమి కారణంగా శ్రీలంక ఆటగాళ్లు, భారత్ బౌలింగ్ ని ఎదుర్కోలేక, క్రీడాస్పూర్తిని మరిచి "డ్రా" కోసం డ్రామా ప్లే చేశారు. మ్యాచ్ ఆసాంతం పరిశీలిస్తే శ్రీలంక తొలి నుండి నియమాలకు విరుద్దంగా ఆడుతూ ఉంది. ఐదో రోజు, సోమవారం కోహ్లి (104 ) సూపర్ బ్యాటింగ్తో భారత్ 352/8 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఛేదనలో లంక.. భువనేశ్వర్ (4/8), షమి (2/34)ల ధాటికి విలవిలలాడింది. భువి, షమి జోరు మీదున్న నేపథ్యంలో ఇంకొన్ని ఓవర్లు పడితే చరిత్రాత్మక విజయం భారత్ సొంతమయ్యేదే. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా భువనేశ్వర్ నిలిచాడు.