ఏలూరు, నవంబర్ 20: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు ప్రభుత్వాసుపత్రి లో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఆక్సిజన్ అందక శిశువు మృతి చెందింది. పాపకు ఉమ్మ నీరు చేరడంతో విజయవాడ ఆసుపత్రికి వైద్యులు తరలించాలన్నారు. అంబులెన్స్ లో విజయవాడకు తరలిస్తుండగా అర్ధాంతరంగా ఆక్సిజన్ అయిపోవడంతో, శ్వాస అందక శిశువు మృతి చెందింది. ఈ ఘటనతో పాప తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.