కేంద్ర మాజీ మంత్రి మున్షీ కన్నుమూత!

SMTV Desk 2017-11-20 14:33:43  priyaranjan das munshi, died, national updates

కలకత్తా, నవంబర్ 20: కాంగ్రెస్ నేత , కేంద్ర మాజీ మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పశ్చిమబెంగాల్ కు చెందిన ఈయన గతంలో ఫైర్ బ్రాండ్ గా పేరొందారు. యుపిఎ హయాంలో కేంద్రం లో ప్రియరంజన్ దాస్ మున్షీ మంత్రిగా పనిచేశారు. దాస్ మున్షీ వయసు ఎనభై మూడేళ్లు. మున్షీ భార్య కూడా రాజకీయాలలో క్రియాశీలం గానే ఉండేవారు. దాస్ మున్షీ మరణానికి ప్రధాని మోది , వివిధ రాజకీయ పక్షాల నేతలు సంతాపం ప్రకటించారు.