న్యూఢిల్లీ, నవంబర్ 20: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. సమావేశంలో ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నిక షెడ్యూల్ ఖరారుపై నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రాహుల్ ఎన్నిక ఓటింగ్ ద్వారాన లేక ఏకగ్రీవంగానా అనే విషయం గురించి చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా సోనియాగాంధీ కొనసాగనున్నారు. యువ నాయకుడు ఎన్నిక లాంఛనమే అని కాంగ్రెస్ వర్గాల సమాచారం.