2019లో మాదే అధికారం: జీవన్‌రెడ్డి

SMTV Desk 2017-11-19 18:04:40  jeevanreddy comments on trs, jeevan reddy, congress updates

జగిత్యాల, నవంబర్ 19: 2019లో తెలంగాణాలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్‌లు రూ. 2వేలకు పెంచుతామని, వరి, మొక్కజొన్నకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అప్పుల ఊబిలో చిక్కుకుందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, తగిన బుద్ధి చెప్పటానికి ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.