అమలాపురం, నవంబర్ 19: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ మహిళ అధ్యక్షురాలు బాలా మునికుమారి సూసైడ్ అంటెప్ట్ కలకలం రేపింది. కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడంతో మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. మునికుమారి ప్రస్తుతం ముమ్మిడివరం నగర పంచాయతీ వార్డు మెంబర్ గా కొనసాగుతున్నారు.