అమరావతి, నవంబర్ 19 : పౌర సరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వై.ఎస్ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ కోసం జైలు గోడలు ఎదురు చూస్తున్నాయని, ఏదో విధంగా జైలు బయట ఉండాలనేది జగన్ తాపత్రయం అన్నారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. పది రోజుల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చి బంగారు పళ్లెంలో అన్నం పెడతామంటే ప్రజలు నమ్ముతారా..? అని బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావు విమర్శించారు.