న్యూఢిల్లీ, నవంబర్ 19 : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నానమ్మఇందిరా గాంధీకి నేడు శత జయంతి కావడంతో ట్విటర్ ద్వారా నివాళులర్పించారు. దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శత జయంతి సందర్భంగా ఆమె మనవడు రాహుల్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని శక్తి స్థల్ స్థూపాన్ని సందర్శించి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రణబ్ మీడియాతో ప్రసంగిస్తూ....సూటిగా మాట్లాడే తత్వం కాబట్టే ఆమెకు గొప్ప నాయకురాలిగా పేరు రావడంతో పాటు, భారత ఉక్కు మహిళ అని గుర్తింపు వచ్చిందని ఇందిరను తలచుకున్నారు. కాగా, ట్విటర్ ద్వారా కూడా రాహుల్ నువ్వే నా గురువు, మార్గదర్శకులు, అంటూ ఆమెను గుర్తుచేసుకున్నారు.