అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జానారెడ్డి.. పరామర్శించిన నేతలు

SMTV Desk 2017-11-19 11:06:05  janareddy, yashoda hospital, home minister naayini narsimha reddy, harish rao.

హైదరాబాద్, నవంబర్ 19 : అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత కే.జానారెడ్డి ఇటీవల అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. జానారెడ్డి ఆసుపత్రిలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావులు యశోద హాస్పిటల్ కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.