జమ్మూకాశ్మీర్, నవంబర్ 19 : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బందిపోరాలో ఇరువురి మధ్య హోరాహోరీ కాల్పులు కొనసాగాయి. నిఘా వర్గాల సమాచారంతో ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టి ఆరు మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నారు. మరికొందరు పరారైనట్లు తెలుస్తోంది. వారికోసం భద్రతబలగాలు వేట కొనసాగిస్తున్నాయి.