చిత్తూరు, నవంబర్ 19: చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం ఎన్ఆర్ కండ్రిగలో ఆదివారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయి. భూమి స్వల్పంగా కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.