ఆర్టీసీ బస్సు లారీ ఢీ..

SMTV Desk 2017-11-18 18:17:02  bus accident, east godavari,

తూర్పుగోదావరి, నవంబర్ 18: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిలోని కలవచర్ల కూడలిలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. దీంతో బస్సు అదుపుతప్పి సమీపంలోని పంట కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సు శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, 20 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.