ఆళ్లగడ్డలో జగన్ సభ కు కిక్కిరిసిన జనం...

SMTV Desk 2017-11-18 15:03:40  ys jagan, ycp, maha sankalpa yaathra details

ఆళ్లగడ్డ, నవంబర్ 18: విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఆళ్ల గడ్డ చేరుకున్నప్పుడు ప్రజలు విశేషంగా తరలిరావడం ఆ పార్టీ నేతలకు ఆనందం కలిగించింది. ఆళ్లగడ్డ కు ఫిరాయింపు మంత్రి భూమ అఖిల ప్రియ ప్రాతినిద్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ను చూసేందుకు తరలివచ్చిన జనంతో ఆళ్లగడ్డ కిక్కిరిసిపోయింది. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు పోటీ పడ్డారు. కరచాలనాలు చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ముందుకు వచ్చారు. వారందరినీ పలకరిస్తూ జననేత పాదయాత్ర సాగించారు. ఆళ్లగడ్డ లో జగన్ ప్రసంగిస్తున్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున స్పందించడం కూడా కనిపించింది.