అహ్మదాబాద్, నవంబర్ 18: గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి శుక్రవారం ప్రకటించింది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిటీ 70 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను రూపొందించినట్లు కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జెపి నడ్డా ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పశ్చిమ రాజ్కోట్ నుంచి బరిలోకి దిగనున్నారు. బిజెపి కంచుకోటలైన మేషానా నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి నితిన్భాయి పటేల్, పశ్చిమ భావనగర్ నుంచి జీతుభాయి వఘానిలను పోటీకి నిలిపింది. తొలి దశలో 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో డిసెంబర్ 9న పోలింగ్ జరగనుంది. 70 స్థానాల్లో బిజెపి పోటీ చేయగా, మిగిలిన స్థానాలకు బిజెపి మిత్ర పక్షాలు పోటీ చేస్తున్నాయి. నవంబర్ 14 నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. రెండో దశ పోలింగ్ డిసెంబర్ 14న జరగనుండగా 18న ఫలితాలు విడుదల కానున్నాయి.