కోల్ కతా, నవంబర్ 18 : శ్రీలంక తో కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో, ఓవర్ నైట్ స్కోర్ 74/5 తో మూడో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి సేన తన తొలి ఇన్నింగ్స్ లో 172 పరులుగులకే ఆలౌటైంది. పుజారా(52) పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన , జడేజా(22), షమీ(24)లు పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో లక్మల్ నాలుగు వికెట్లు సాధించగా,గామేజ్, షనక, పెరీరాలు తలో రెండు వికెట్లతో భారత్ జట్టు వెన్ను విరిచారు.