కర్నూలు, నవంబర్ 18: కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 11వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ పదకొండో రోజు పాదయాత్రను శనివారం దొర్నిపాడు నుంచి ప్రారంభించారు. నేడు పాదయాత్ర కంపళ్లమెట్ట, ఉయ్యాలవాడ క్రాస్ రోడ్, భీమునిపాడు మీదుగా కోవెలకుంట్ల వరకు కొనసాగనుంది.