అమరావతి, నవంబర్ 17: నటుడు, ప్రత్యేక హోదా సాధన నేత శివాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, వెంకయ్య కలిసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. చంద్రబాబు కొడుక్కి వచ్చింది జాబు..కానీ ప్రజలకు రాలేదని విమర్శించారు. బాబు పార్టీలో అందరూ దొంగలే, ఆ దొంగలే ఎమ్మెల్యేలు అయ్యారంటు ఆరోపించారు. ఏపి ప్రత్యేక హోదాపై ప్రశ్ని౦చకపోతే భవిష్యత్తులో నష్టపోతామని తెలిపారు. టీడీపీలో ఉన్న వారికే అవార్డులు ఇవ్వడం సరికాదని, ప్రజల అభిప్రాయాలని సేకరించి అవార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆనాడు మిస్సమ్మ సినిమాలో తనకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అదే అన్యాయం జరిగింద౦టు గుర్తు చేశారు.