హైదరాబాద్, నవంబర్ 17: ఈ రోజు వరకు రసాభాసగా సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. మళ్లి డిసెంబర్ నెలలో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని స్పీకర్ మదుసుదనాచారి తెలిపారు. 16 రోజుల పాటు సాగిన శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా వేశారు. నేడు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, జిల్లాల పునర్వ్యవస్థీకరణలపై చర్చలు కొనసాగాయి. ఇంతటితో వాడివేడిగా సాగిన చర్చలకు స్పీకర్ ముగింపు పలికారు.