గీతారెడ్డి చెప్పిన మాటలను అంగీకరిస్తాను: కెసిఆర్

SMTV Desk 2017-11-17 12:41:17  kcr, geetha reddy, assembly meeting, telangana

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష నేత గీతా రెడ్డి ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై మాట్లాడగా, వెంటనే తెలంగాణ సీఎం కెసిఆర్ స్పందించారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలు సహా, అణగారిన కులాలకు చెందిన ఎంతో మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మాట వాస్తవమేనని, ఈ విషయంలో విపక్ష మహిళా నేత గీతారెడ్డి చెప్పిన మాటలను అంగీకరిస్తాను అంటూ ఆయన అన్నారు. వారి పరిస్థితులు ఒక్క రోజులో మారిపోయేవి కావని, గత ప్రభుత్వాలు తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగానే, వారు అలా ఉన్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఈ విషయంపై ఏ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగిందో సభ దృష్టికి తీసుకువస్తే, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతేగాని ప్రతి విషయాన్ని రచ్చ చేయాలని చూస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు.