మెట్రో ప్రారంభానికై రాష్ట్రంలో మోదీ పర్యటన...

SMTV Desk 2017-11-17 12:13:55  narendra modi, metro train launched date fixed, hyderabad,

హైదరాబాద్, నవంబర్ 17: చాలాకాలంగా హైదరాబాది వాసులు ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభ౦, ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగనుంది. మోదీ పర్యటనకు సంబంధించి ఆయన కార్యాలయం తెలంగాణ ప్రభుత్వానికి సూత్రప్రాయ సమాచారం అందించింది. ఈ నెల 28న ఐదున్నర గంటల పాటు రాష్ట్రంలో మోదీ పర్యటన సాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మెట్రో స్టేషన్ కు చేరుకొని మెట్రో రైలు ను ప్రారంభిస్తారు. అనంతరం ఆయన హెచ్ఐసి కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రాత్రి ఏడూ గంటలకు ఫలక్ నుమా ప్యాలెస్ లో జిఈఎస్ అతిధులకు కేంద్రం ఇచ్చే విందుకు హాజరావుతారు. అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని రాత్రి 8 గంటలకు ఢిల్లీకి పయనమవుతారు.