మాస్క్ లతో ఎమ్మెల్యేల విన్నూత నిరసన...

SMTV Desk 2017-11-17 11:37:58  kapil mishra, majinder singh, protest , delhi smog

న్యూఢిల్లీ, నవంబర్ 17 : ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య పెనుభూతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ విషయంపై తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే కపిల్ మిశ్రా, బీజేపీ శాసనసభ్యుడు మంజిందర్ సింగ్‌లు విభిన్న పద్దతిలో నిరసన తెలిపారు. రూ.700 కోట్ల పర్యావరణ సెస్ నిధులను ఉపయోగించనందుకు నిరసనగా, సర్దార్ పటేల్ రోడ్డులోని జ్ఞానమూర్తి విగ్రహం వద్ద ఉన్న మహాత్మాగాంధీ, మదర్ థెరిస్సా విగ్రహాలకు మాస్క్ కట్టారు. మంజిందర్ సింగ్‌ మాట్లాడుతూ ప్రజలు కాలుష్యబారిన పడి ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు.