వాషింగ్టన్, నవంబర్ 16 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్)లో పాల్గొనేందుకు భారత్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ప్రయాణాలు అధికారికంగా ఖరారయ్యాయి. మొదట ఇవాంకా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యేక విమానంలో ల్యాండ్ కానున్నారు. అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) మీదుగా హైటెక్స్ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం గుండా ఫలక్ నుమా ప్యాలెస్ కు చేరుకోని రాత్రి అక్కడ బస చేస్తారు. ఆ మరుసటి రోజు సదస్సులో పాల్గొంటారు. ఆ సదస్సు ముగిసిన తర్వాత ఇవాంకా చార్మినార్, లాడ్ బజార్ లలో షాపింగ్ నిమిత్తం పలు ప్రదేశాలను సందర్శించనున్నారు. కాగా ఆమె రాకతో నగరంలో భద్రతాధికారులు హై అలర్ట్ ప్రకటించారు.