పిడుగురాళ్ల, నవంబర్ 16 : అంగన్వాడీ ఆయా పోస్టుకు లక్ష రూపాయలు ఖర్చవుతుందని అన్నాడు ఓ నేత. అంతే కాదు అనేక రకాలుగా వేధించాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఆలస్యంగా వెలుగులోకి తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే... మాచవరానికి చెందిన మత్సా శోభ, 2012లో అంగన్వాడీ ఆయా ఉద్యోగం కోసం అప్పటి ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి వద్దకు వెళ్లి౦ది. ఆ రోజు నుంచి ఆయన తనను అనేక రకాలుగా వేధించాడని తెలిపింది. ఆయా పోస్టు ఇప్పించేందుకు లక్ష రూపాయలు ఖర్చవుతుందని అనేవాడని చెప్పింది. నగదు ఇచ్చిన తరువాత ఉద్యోగం రాకపోవటంతో, ఆమె మళ్లీ అతనిని సంప్రదించగా కోరిక తీరిస్తేనే కొలువు ఇప్పిస్తానని పచ్చిగా మాట్లాడాడని పేర్కొంది. గుంటూరులో ఉంటే ఫోన్ చేసి ఇంటి అడ్రస్ చెప్పు, వస్తాను అనేవాడని . గుంటూరులో ఇబ్బందైతే పిడుగురాళ్ల అయినా ఫర్వాలేదని నీచంగా మాట్లాడేవాడని తెలిపింది. ఆయన ప్రవర్తనతో విసిగిపోయిన శోభ, తన డబ్బులు తనకిమ్మంటే చంపేస్తానని బెదిరించ౦డం మొదలుపెట్టాడని చెప్పింది. ఇక కృష్ణారెడ్డి వేధింపులు తాళలేక శోభ పోలీసులను ఆశ్రయించింది. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని శోభ వాపోయింది.