అమరావతి, నవంబర్ 16 : సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ రేపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రానున్నారు. కాగా రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వీరిరువురు అమరావతిలో సింగపూర్ సంస్థలు చేపట్టే ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు సమాచారం.