తక్కువ ధరకే ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్లు ...

SMTV Desk 2017-11-16 17:18:30  airtel, mera pehla smart phone, a1 indian,

ముంబై, నవంబర్ 16 : జియో స్మార్ట్ ఫోన్ కు పోటీగా 4జీ ఆండ్రాయిడ్ ఫోన్ ని విడుదల చేయన్నునట్లు ఎయిర్ టెల్ సంస్థ , ప్రముఖ మొబైల్ హ్యాండ్ సెట్ తయారీదారి కార్బన్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ41 పవర్‌’ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో ఏ1 ఇండియన్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.4,390 కాగా, రూ.1,799కే అందిస్తోంది. ఇక ‘ఏ1 41 పవర్‌’ 4జీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.4,290 కాగా, రూ.1,849కే విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌' కార్యక్రమంలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేస్తున్నట్టు భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ప్రతి భారతీయుడు 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసి, డిజిటల్‌ రంగంలో భాగస్వామ్యులు కావాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు పేర్కొంది. ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ అయిన అమెజాన్‌లో కూడా ఈ ఫోన్లు లభిస్తాయని భారతీ ఎయిర్‌టెల్‌ సీఎంవో రాజ్‌ పెద్దపూడి తెలిపారు.