తెలంగాణ, నవంబర్ 16 : సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత సంకినేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఫుట్ బాల్ ఆడుకుంటారని.. రాజకీయాల్లో ఎదగాలనుకోవడం సహజమే కాని ఇప్పుడున్న పార్టీలకు సిద్ధాంతాలు లేకుండా పోయాయని... ఉన్న పార్టీల్లోనే మంచి పార్టీని ఎంచుకోవాలి" అని చెప్పారు. ప్రస్తుతానికి తెలంగాణలో టీడీపీ లేదని.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ముఖ్య నేతల కుమారులు సైతం బీజేపీ వైపు చూస్తున్నారని.. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ వంటి ముఖ్యమైన నేతలు కూడా బీజేపీలోకి రావచ్చేమో అని తెలిపారు.