వల్లభనేని హత్య కేసులో ముగ్గురు వ్యక్తులు..?

SMTV Desk 2017-11-16 12:23:14  TRS leader, murder mystry, Vallabhaneni Srinivasa Rao, sanath nagar.

హైదరాబాద్, నవంబర్ 16 : హైదరాబాద్ లోని సనత్ నగర్ లో టీఆర్ఎస్ నాయకుడు వల్లభనేని శ్రీనివాసరావు దారుణ హత్యకు గురయ్యారు. ఏపీలోని పాలకొల్లుకు చెందిన శ్రీనివాసరావును టీఆర్ఎస్ లోని మరో వర్గం వ్యక్తులు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఘటన స్థలంలో ఒక మద్యం బాటిల్, నాలుగు గ్లాసులు కనిపించాయి. అయితే నలుగురు కలిసి మద్యం తాగిన అన౦తరం వీరి మధ్య ఏవో గొడవలు జరిగి ముగ్గురు వ్యక్తులు శ్రీనివాసరావుపై దాడికి దిగి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.