డబ్లిన్, నవంబర్ 16 : ఆయిన ఓ ప్రముఖ సంస్థ సీఈఓ...తన కంపనీలో పనిచేసే ఉద్యోగిని డెస్క్ లో ఒక సెల్ఫీ తీసుకున్నారు. అది కాస్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకి జరిగిన విషయమేమిటంటే.. లింక్డిన్ సీఈవో జెఫ్ వైనర్ ఇటీవల డబ్లిన్లోని తన కంపెనీలో ఉద్యోగులను కలిసేందుకు వెళ్లారు. సరిగ్గా అదే రోజు కంపనీ లో పనిచేసే ఎనలిస్టిక్ మేనేజనర్ మరియా వాల్టన్ సెలవులో ఉండాల్సి వచ్చింది. మరియా తప్పని పరిస్థితిల్లో సెలవు రద్దు చేసుకోలేకపోయారు. దీంతో జెఫ్ కు క్షమాపణలు కోరుతూ ఓ లేఖ రాసి తన ఉపయోగించే సిస్టమ్కు అంటించింది. ఆమె సెలవు తర్వాత వచ్చే సరికి వాల్టన్కు మరో ఫొటో తన డెస్క్పై కనిపించింది. అందులో జెఫ్ తన డెస్క్తో సెల్ఫీ తీసుకొని ఆ ఫొటోను అక్కడ పెట్టి వెళ్లారు. అది చూసిన వాల్టన్ జెఫ్కు కృతజ్ఞతలు తెలిపింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఆ ఫోటో ను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ‘కూల్ సీఈవో’.. ‘ఇటువంటి సీఈవో మాకు లేనందుకు అసూయగా ఉంది’అని కామెంట్లు చేస్తున్నారు.