హైదరాబాద్, నవంబర్ 16 : సనత్ నగర్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నాయకుడు వల్లభనేని శ్రీనివాసరావును గుర్తు తెలియని వ్యక్తులు తలను బండరాళ్ళతో మోది అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ రోజు తెల్లవారుజామున మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.