హైదరాబాద్, నవంబర్ 15 : హైదరాబాద్ లోని హుస్సేనీ అలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్యాంకులో ఫోర్జరీ డీడీలతో కందికుంట మోసానికి పాల్పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ వెంకట ప్రసాద్ ను దోషిగా నిర్ధారిస్తూ అతనికి ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. అతనితో పాటు అసిస్టెంట్ మేనేజర్ నర్సింగరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, ఇన్ స్పెక్టర్ వెంకట మోహన్ కు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.