హైదరాబాద్, నవంబర్ 15 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ శిసోడియా హాజరయ్యారు. ఆయనకు ఐటీ మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్ లో మనీష్ మాట్లాడుతూ.. టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని ప్రశంసించారు. అలాగే టీహబ్ చాలా బాగుందని, ఢిల్లీలో కూడా టీహబ్ ను ఏర్పాటు చేస్తే తాము కూడా కలిసి పని చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీ మొత్తం కాలుష్యంతో నిండిపోయిందని, హైదరాబాద్ లో వాతావరణం చాలా బాగుందని కితాబిచ్చారు.