రాందేవ్ బాబాతో కవిత భేటీ..

SMTV Desk 2017-11-15 15:49:53  Nizamabad MP kalavukuntula kavitha, Patanjali CEO RAMDEV BABA, Meeting.

హైదరాబాద్, నవంబర్ 15 : నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, పతంజలి ఉత్పత్తుల సంస్థ సీయీవో, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య పతంజలి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుపై చర్చ జరిగింది. ఈ ఉత్పత్తులను నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఈ పతంజలి సంస్థ దేశంలోని పలు ప్రాంతాలలో బ్రాంచీలను నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఏపీలో కూడా ఒక కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.