జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2017-11-15 15:25:34  JC Diwakar, sensational comments on ys jagan.

హైదరాబాద్, నవంబర్ 15 : వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. "వైఎస్ హయంలో.. ఆయన పాదయాత్ర చేయడం వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. జగన్ పాదయాత్ర వృథా ప్రయాసే. ఆయన కారణంగా రెడ్డి కులస్తులకు విలువ లేకుండా పోయింది. వైఎస్ గురించి చెప్పుకునే రోజులు పోయాయని" స్పష్టం చేశారు. జగన్ పాదయాత్రకు జనాలు వస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ రోజుల్లో హీరోలు, హీరోయిన్ లు పెట్టిన పార్టీలకు కూడా జనాలు వస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పార్టీ పెడితే జనాలు ఎగబడతారని జేసీ ఎద్దేవా చేశారు. తానూ 2019 లో రిటైర్ అవుతానని, ఇకపై తనకు రాజకీయాలు అనవసరమన్నారు. జగన్ కూడా రాజకీయాలు వదిలేస్తే మంచి పారిశ్రామిక వేత్తగా పేరు తెచ్చుకుంటారని జోష్యం చెప్పారు.