రాజస్థాన్, నవంబర్ 15 : అతనొక వైద్యుడు, అయన దగ్గరకు వచ్చే రోగులకు మందులతో పాటు దేవుళ్లను ప్రార్థించండి అంటూ మెడికల్ స్లిప్ రాసిస్తాడు. ఇదేంటి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా..! వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాకు చెందిన దినేశ్ శర్మ, 1998లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఓ క్లినిక్ నడుపుతున్నాడు. ఇటీవల తన దగ్గరికి వచ్చిన శేఖర్ అనే టీవీ మెకానిక్కి అక్టోబర్ 13న ఆయన రాసిచ్చిన స్లిప్ లో మందులతో పాటు అదే ప్రిస్క్రిప్షన్ మీద రోజూ హనుమాన్ చాలీసా చదవాలని, గుళ్లకు వెళ్లాలని, దేవుళ్లకు హారతులు ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇలా రాయడమేంటని ప్రశ్నించగా.. తాను అలా రాయడం వల్ల రోగులకు మానసిక సాంత్వన కలుగుతుందని సమాధానమిచ్చాడు. ఇప్పుడు ఈ స్లిప్ కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.