ముంబై, నవంబర్ 15 : ప్రపంచ మార్కెట్ రంగంలో కొత్త సాంకేతికత ను అందిపుచ్చుకొని మొబైల్ రారాజు గా పేరొందిన దక్షణా కొరియా సంస్థ శాంసంగ్కు, చైనా కంపెనీ షియోమీ తీవ్ర పోటినిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం అగ్రశ్రేణి స్మార్ట్ఫోన్ బ్రాండ్ల విషయంలో సవాల్ విసురుతుంది. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ విడుదల చేసిన మూడో త్రైమాసికా గణాంకాల ప్రకారం ఈ రెండు కంపెనీలు ప్రధమ స్థానంలో నిలిచాయి. శాంసంగ్ మోడల్ లో గెలాక్సీ జే2, గెలాక్సీ జే7 ఎన్ఎక్స్టీ, గెలాక్సీ జే7 మ్యాక్స్, బాగా మార్కెట్ లో వినయోగాదారులును ఆకర్షించాయి. ఇక షియోమీకి చెందిన రెడ్మీ నోట్4 బాగా అమ్ముడైన ఫోన్గా నిలిచింది. లెనోవో, వివో, ఒప్పో టాప్-5లో నిలిచాయి.