శబరిమలలో భక్తులకై ప్రత్యేక ఏర్పాట్లు..

SMTV Desk 2017-11-14 19:03:39  Sabarimala temple, Modern accommodation facilities, for devotees.

కేరళ, నవంబర్ 14 : శబరిమలలో ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది నుంచి ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించారు. అలాగే నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, ప్రతిరోజూ 5 వేల మంది భక్తులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేసినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా కేరళ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి సుందరన్ మాట్లాడుతూ.. తొలిసారిగా శబరిమలలో ఇలాంటి సేవల్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. మహిళా భక్తుల కోసం పంపా నది నుంచి అయ్యప్ప సన్నిధానం వరకూ ప్రత్యేక క్యూలైన్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, మండల పూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అయ్యప్ప ఆలయాన్ని రేపటి నుంచి తెరవనున్నారు.