టీఆర్ఎస్‌ లోకి కొనసాగుతున్న వలసల పర్వం...

SMTV Desk 2017-11-14 15:07:12  gandra sataynaryana, jump to trs, jayasankar bupalapalli, telagana

హైదరాబాద్, నవంబర్ 14 : తెలంగాణాలో టీడీపీ పార్టీ కి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. అప్పటి నుండి చాలామంది నాయకులూ కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్‌ పార్టీ లోకి వలసలు పెంచారు. తాజాగా జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లా టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి గండ్ర స‌త్య‌నారాయ‌ణ కూడా ఈ రోజు రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడుకి పంపారు. గండ్ర రేపు టీఆర్ఎస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారని పార్టీ వర్గాల సమాచారం.