ముంబై, నవంబర్ 14 : ప్రముఖ టెలికాం రంగం సంస్థ భారతి ఎయిర్ టెల్, వొడ ఫోన్ మరో ఆకర్షణీయమైన పధకంను తమ వినయోగాదారుల కోసం తీసుకొచ్చాయి. ప్రస్తుత జియోకు షాకిచ్చేలా ఎయిర్ టెల్, వొడ ఫోన్ తన కస్టమర్లకు సరికొత్త ఆకర్షణీయ రీచార్జ్ప్లాన్లను లాంచ్ చేయడం విశేషం. ఎయిర్ టెల్ తమ పథకంలో లో భాగంగా రూ.3999 రీచార్జ్ ప్లాన్ లో 300 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. 360 రోజులు చెల్లుబాటయ్యేలా ఈ ప్లాన్ను విడుదల చేసింది. రూ.1999 రీచార్జ్పై 180 రోజుల (ఆరునెలలు) కాలపరిమితిలో.. 125 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ (నేషనల్ రోమింగ్), 100 సందేశాలు రోజుకు ఉచితం. రూ. 999 రీచార్జ్పై 90 రోజులు(మూడు నెలలు) వ్యవధిలో 60 జీబీ డేటా, దీంతోపాటు నేషనల్ రోమింగ్ & (100 ఎస్ఎంఎస్ / రోజుకు) ఉచితం. ఇక వొడాఫోన్ సంస్థ తమ యూజర్లకు రూ.458తో రీఛార్జ్ చేయించుకుంటే అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు, 1జీబీ 3జీ లేక 4జీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు ఉంటుంది. ఇవే సౌకర్యాలతో రూ.509 ప్లాన్ కూడా ప్రకటించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ల ద్వారా రోజుకు గరిష్టంగా 250 నిమిషాల వరకు, వారానికి 1 వేయి నిమిషాల వరకు లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జియో పోటికి ధీటుగా తమ వినయోగాదారులకు ఈ రెండు సంస్థలు వరుసుగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.