మనీలా, నవంబర్ 14 : ఆగ్నేయాసియా దేశ సంఘం(ఆసియాన్) స్వర్ణోత్సవాల నిమిత్తం భారత ప్రధాని మోదీ ఆదివారం ఫిలిప్పీన్స్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన మూడో రోజు పర్యటనలో భాగంగా జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో మోదీ భేటీ అయ్యారు. ఈ ఇరు దేశాధినేతలు పలు ద్వైపాక్షిక అంశాల గురించి, గ్లోబల్ పార్టనర్ షిప్పై చర్చించినట్లు తెలుస్తోంది. అంతకు ముందే మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్నబుల్తో భేటీ అయ్యారు. వీరితో పాటు బ్రూనే సుల్తాన్ హస్సనల్ బోల్కై, న్యూజిలాండ్ ప్రధాని జసిడా ఆండ్రేన్తో మోదీ భేటీ అయ్యారు.