అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ : జీవన్ రెడ్డి

SMTV Desk 2017-11-14 12:04:22  Congress member Jeevan Reddy, comments on telangana state

హైదరాబాద్, నవంబర్ 14 : దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కాంగ్రెస్‌ శాసన సభ్యుడు జీవన్ రెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చి మూడున్నర ఏళ్ళు కావస్తుండగా అప్పుల భారం రెట్టింపైందని, జాతీయ స్థాయిలో అప్పుల పెరుగుదల 33శాతంగా ఉంటే తెలంగాణలో మాత్రం 71శాతానికి మించి ఉందన్నారు. ఇది ఇలాగే ఉంటే రాబోయే తరం వారికి ఆ అప్పు కాస్త రెట్టింపు అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ అప్పుల నుండి బయటపడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని డిమాండ్ చేశారు.