ప్రేమ పేరుతో దారుణ హత్య

SMTV Desk 2017-06-11 13:20:59  yadagiri gutta, lover, kiiling

యాదగిరిగుట్ట, జూన్ 11 : ప్రేమ పేరుతో ఉన్మాది చేతిలో మరో అమ్మాయి బలైంది. నేటి సభ్య సమాజంలో అమ్మాయిల పై అనేక రకాల దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు నరరూప రాక్షసులు. అలాంటి ఓ రాక్షసుడే అతన్ని కాదని వేరే పెళ్ళికి ఏర్పాట్లు చేస్తుండటంతో అమ్మాయిని హత్య చేసిన సంఘటన యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... యాదరిగిగుట్ట యాదగిరిపల్లి కాలనీలో సుధగాని గాయత్రీ (21), గోరుగంటి శ్రీకాంత్ (24) లు నివసిస్తున్నారు. శ్రీకాంత్, గాయత్రీ ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసి, ఇరువర్గాల సమక్షంలో వారిద్దరిని మందలించారు. గాయత్రికి వేరే అబ్బాయి తో వివాహ నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ తనకు గాయత్రి దక్కదని భావించి శనివారం రోజున మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేరని తెలుసుకొని గాయత్రిని కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. తరువాత శ్రీకాంత్ పోలీస్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న గాయత్రిని తన సోదరుడు భువనగిరిలోని ఓ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు దారిలోనే మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.