న్యూఢిల్లీ, నవంబర్ 13 : నేటి స్మార్ట్ ఫోన్ రంగంలో షియోమీ రెడ్మీ నోట్4 ఇటు ఆన్ లైన్ లోను, అటు ఆఫ్ లైన్ లో హాట్ హాట్కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. దీనికి కారణం తక్కువ బడ్జెట్ లో అత్యధిక ఫీచర్ లను కలిగి ఉండడమే..అయితే ప్రస్తుతం వీటి ధరను రూ.1000 శాశ్వతంగా తగ్గిస్తున్నట్లు షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ తెలిపారు. భారత్ లో రెడ్మీ నోట్4 3జీబీ ర్యామ్/32జీబీ వేరియంట్ రూ10,999, 4జీబీ ర్యామ్/64జీబీ వేరియంట్ రూ.12,999 ఉండగా.. రెండు వేరియంట్లపై చెరో వెయ్యి రూపాయలు తగ్గింది. ఈ- కామర్స్ సైట్ లలో కూడా తగ్గింపు ధరకే ఈ ఫోన్ లభిస్తోంది.